Andhra Pradesh: జగన్ గారూ.. ఆ పేద పూజారులు ఏం పాపం చేశారు?: టీడీపీ నేత వర్ల రామయ్య

  • మేం మౌజమ్ లకు వేతనాలు ఇచ్చాం
  • మీరు పోటీగా పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు
  • పేద పూజారులకు కూడా వేతనాలు ఇవ్వండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య ఈరోజు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలోని మసీదుల్లో పనిచేసే మౌజమ్ లకు తమ ప్రభుత్వం నెలనెలా జీతాలు ఇచ్చిందని వర్ల రామయ్య తెలిపారు. ఇందుకు పోటీగా జగన్ చర్చీల్లో పాస్టర్లకు నెలవారీ వేతనాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని వ్యాఖ్యానించారు.

మరి చిన్నచిన్న హిందూ దేవాలయాల్లో పేద పూజారులు ఏం పాపం చేశారనీ, వారికి వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సర్వమత సమానత్వం పాటిద్దామనీ, వారికి కూడా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

More Telugu News