Vizag: గెస్ట్ హౌస్ ల పేరిట వ్యభిచారం... విశాఖ పరిధిలోని సీతమ్మధార, డాబా గార్డెన్స్ ప్రాంతాల్లో పోలీసుల ఉక్కుపాదం!

  • ఇటీవలి కాలంలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
  • స్వయంగా రంగంలోకి దిగిన డీసీపీ
  • పోలీసుల అదుపులో పలువురు

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీర నగరం విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార దందాపై పోలీసులు ఉక్కుపాదం మోదారు. నగర పరిధిలోని డాబా గార్డెన్స్, సీతమ్మధార తదితర ప్రాంతాల్లోని గెస్ట్ హౌస్ లు, లాడ్జీల్లో బయటి నుంచి యువతులను తీసుకు వచ్చి, వ్యభిచారం చేయిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, డీసీపీ స్వయంగా రంగంలోకి దిగారు. లాడ్జీలు, గెస్ట్ హౌస్ లను స్వయంగా తనిఖీలు చేశారు.

వెంకటేశ్వరమెట్ట ఆర్చి సమీపంలోని విశాఖ ఇన్, సీతమ్మధారలోని శ్రీ సాయి గెస్ట్ హౌస్,  పాండురంగాపురం బీచ్‌ గెస్ట్‌ హౌస్‌, ఆరు ఎస్‌కేఎంఎల్‌ ఫ్లాట్లను సీజ్‌ చేశారు. సీతమ్మధార ప్రాంతంలోని ఓ మసాజ్ సెంటర్ లో థాయ్ ల్యాండ్ యువతులతో పురుషులకు మసాజ్ చేయిస్తున్నారని గుర్తించి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి టూరిస్ట్ వీసాలపై ఇక్కడికి అమ్మాయిలను తీసుకుని వస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. పలువురు యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించామని, గెస్ట్ హౌస్ లు, లాడ్జీల నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని అన్నారు.

More Telugu News