London: లండన్ విమానాశ్రయంలో రజనీకాంత్ కుమార్తె, అల్లుడికి షాక్.. పాస్ పోర్టులున్న సూట్ కేస్ మాయం !

  • లండన్ వెళ్లిన సౌందర్య, విశాకన్ దంపతులు
  • లక్షల డాలర్లు సహా పాస్ పోర్టులున్న సూట్ కేస్ మాయం
  • తాత్కాలిక పాస్ పోర్టును ఇచ్చిన దౌత్యాధికారులు

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌ రెండవ కుమార్తె సౌందర్య, ఆమె భర్త విశాకన్‌ లు పాస్‌ పోర్టులను పోగొట్టుకున్నారు. వీరిద్దరూ మూడు రోజుల క్రితం ఎమరాల్డ్స్‌ విమానంలో చెన్నై నుంచి లండన్‌ కు వెళ్లిన వేళ, ఈ ఘటన జరిగింది. లండన్‌ లో ల్యాండ్ అయిన తరువాత, అక్కడి సెక్యూరిటీ అధికారులకు పాస్‌ పోర్టు చూపించడానికి దాన్ని ఉంచిన సూట్‌ కేస్‌ కోసం వెతకగా, అది కనిపించ లేదు. అదే సూట్ కేసులో అమెరికన్ డాలర్లు కూడా ఉన్నాయి.

 దీంతో వారిద్దరూ విమానాశ్రయంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్ పోర్టులు లేని వారిని అధికారులు బయటకు పంపేందుకు నిరాకరించి, వారిని ఎయిర్ పోర్ట్ గెస్ట్ హౌస్ కు పంపారు. ఆపై ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్, లండన్ లోని భారత దౌత్యాధికారులను సంప్రదించి, వారికి సాయపడాలని కోరారు. దీంతో స్పందించిన అధికారులు, ఎయిర్ పోర్టుకు చేరుకుని, విశాకన్, సౌందర్యలకు తాత్కాలిక పాస్‌ పోర్టులను అందించారు. సూట్ కేస్ మాయమైన ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News