Varanasi: వారణాసిలో ఓ స్కూలుకు రూ.618 కోట్ల కరెంటు బిల్లు... బెంబేలెత్తిన యాజమాన్యం

  • ప్రధాని మోదీ నియోజకవర్గంలో ఘటన
  • బిల్లింగ్ సాఫ్ట్ వేర్ లో లోపం
  • దిగ్భ్రాంతికర రీతిలో విద్యుత్ బిల్లు
  • ఈ నెల 7వ తేదీలోపు చెల్లించాలంటూ స్పష్టం చేసిన విద్యుత్ సిబ్బంది

ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. వారణాసిలోని వినాయక్ కాలనీలో ఉన్న ఓ పాఠశాలకు వచ్చిన విద్యుత్ బిల్లు చూస్తే గుండె గుభిల్లుమంటుంది. ఆ స్కూలుకు ఏకంగా రూ.618 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఊహించని ఈ పెను ఉత్పాతాన్ని చూసి పాఠశాల యాజమాన్యం షాక్ కు గురైంది. విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితంలేకపోయిందని స్కూలు సిబ్బంది వాపోయారు.

అన్నింటికీ మించి ఈ నెల 7వ తేదీలోపు బిల్లు చెల్లించకపోతే కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరించడం వారిని మరింత బాధించింది. ఉన్నతాధికారులను వివరణ కోరగా, సాఫ్ట్ వేర్ సమస్య కారణంగానే బిల్లింగ్ లో పొరపాటు జరిగిందని వెల్లడించారు. ఆ స్కూలుకు తప్పుడు కరెంటు బిల్లులు రావడం ఇదే ప్రథమం కాదు. గతంలోనూ బెంబేలెత్తించే రీతిలో బిల్లులు వచ్చాయట.

More Telugu News