Sensex: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 80 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 3 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 8 శాతం పైగా లాభపడ్డ టాటా మోటార్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్  80 పాయింట్లు కోల్పోయి 36,644కి పడిపోయింది. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 10,847 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (8.04%), ఓఎన్జీసీ (5.21%), యస్ బ్యాంక్ (3.87%), ఎన్టీపీసీ (3.35%), మారుతి సుజుకీ (2.65%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.66%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.20%), టీసీఎస్ (-1.38%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.16%), టెక్ మహీంద్రా (-1.09%).

More Telugu News