Saaho: సాహో ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం అభిమానులే: కృతజ్ఞతలు తెలిపిన ప్రభాస్

  • ఆగస్టు 30న రిలీజైన సాహో
  • ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగా వసూలు చేసిందంటూ పోస్టర్ 
  • ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సాహో మూవీ ఆగస్టు 30న రిలీజై బాక్సాఫీసు వద్ద గణనీయమైన స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగా గ్రాస్  వసూలు చేసిందంటూ పేర్కొంటున్న ఓ పోస్టర్ ను హీరో ప్రభాస్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. నా ప్రియమైన ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు... సాహో పట్ల మీరు చూపుతున్న ఎల్లలు లేని అభిమానానికి ధన్యవాదాలు అంటూ పోస్టు చేశాడు. సాహో చిత్రం ఈ స్థాయిలో ఉండడానికి, ఇంతటి ఘనవిజయం సాధించడానికి అభిమానులే కారణమని తెలిపాడు. మొదటి నుంచి వారి ప్రోత్సాహం, వారి స్పందన అద్భుతమని, అందుకే అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు తన పోస్టులో పేర్కొన్నాడు.

More Telugu News