Nithin: విలన్ పాత్రలో హెబ్బా పటేల్

  • 'భీష్మ'గా నితిన్ 
  • నాయిక పాత్రలో రష్మిక 
  • హెబ్బాకి ఛాన్స్ ఇచ్చిన వెంకీ కుడుముల

'కుమారి 21F' సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హెబ్బా పటేల్, ఆ తరువాత ఆ స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అందాలు ఒలకబోయడానికి ప్రయత్నించినా, ఎంచుకున్న కథల్లో విషయం లేకపోవడం వలన వెనుకబడిపోయింది. తాజాగా ఆమె మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అయితే ఈ సారి ఆమె ఓకే చెప్పింది హీరోయిన్ రోల్ కోసం కాదు .. విలన్ పాత్ర కోసం.

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా 'భీష్మ' రూపొందుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కీలకంగా వుంటుందట. ఈ పాత్రలో హెబ్బా పటేల్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పేసిందట. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్రలో హెబ్బా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.

More Telugu News