Varun tej: 'వాల్మీకి' సినిమాలో అతిథి పాత్రలో నితిన్

  • హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
  • డిఫరెంట్ లుక్ తో వరుణ్ తేజ్ 
  • ఈ నెల 20వ తేదీన విడుదల 

హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' సినిమా రూపొందింది. వరుణ్ తేజ్ - అధర్వ మురళి ప్రధానమైన పాత్రలను పోషించగా, వాళ్ల జోడీలుగా పూజా హెగ్డే - మృణాళిని రవి కనిపించనున్నారు. తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. 14 రీల్స్ సంస్థ నిర్మించిన 'వాల్మీకి'ని ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో కథలో భాగంగా ఒక సినిమా హీరో ఎంట్రీ ఇవ్వవలసి ఉంటుంది. సినిమా హీరోగా గెస్టు పాత్రను తమిళంలో విజయ్ సేతుపతి చేశాడు. తెలుగులో ఆ పాత్రను నితిన్ చేసినట్టుగా సమాచారం. హరీశ్ శంకర్ రిక్వెస్ట్ చేయడంతో ఎంతమాత్రం ఆలోచించకుండా నితిన్ ఓకే చెప్పాడట. ఆయనకి సంబంధించిన షూటింగును ఇటీవలే పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. డిఫరెంట్ లుక్ తో వరుణ్ తేజ్ కనిపిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.

More Telugu News