Jagan: జగన్ తో భేటీ అయిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

  • సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ
  • పలు అంశాలపై చర్చ
  • అంతకు ముందు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో... ఇరువురు పలు అంశాలపై చర్చించారు. అంతకు ముందు కనకదుర్గ అమ్మవారిని గిరిరాజ్ సింగ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈవో సురేశ్ బాబు ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నంత కాలం ధర్మం  కాపాడబడుతుందని చెప్పారు.

More Telugu News