YS Viveka: వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా తేల్చండి: జగన్ ఆదేశాలు

  • ఇంకా ఓ కొలిక్కి రాని వివేకా హత్య కేసు విచారణ
  • కడపలో మకాం వేసిన డీజీపీ
  • నేడు సిట్ బృందంతో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసు విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో పోలీసులకు జగన్ కీలక ఆదేశాలను జారీ చేశారు. హత్య కేసును త్వరగా తేల్చాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కడపలో మకాం వేశారు. కేసు విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందంతో ఈరోజు ఆయన భేటీ కానున్నారు.

More Telugu News