Chandrababu: రాజకీయ పునరేకీకరణ కోసమే బీజేపీలోకి.. చంద్రబాబుపై కోపంతో కాదు: రేవూరి

  • కేసీఆర్ తన వాక్చాతుర్యంతో టీడీపీని ఆంధ్రా పార్టీగా ముద్రవేశారు
  • బీజేపీలోకి చంద్రబాబే పంపిస్తున్నారన్న వార్తలు అవాస్తవం
  • కాంగ్రెస్‌కు నడిపించే నాయకుడే లేడు

తనకు టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా ఎలాంటి కోపం, వ్యతిరేకత లేవని ఈ రోజు మధ్యాహ్నం బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరింది రాజకీయ పునరేకీకరణ కోసమేనని స్పష్టం చేశారు. బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈ మధ్యాహ్నం ఆయన బీజేపీలో చేరారు. అనంతరం మీడియాతో  మాట్లాడిన రేవూరి.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తన వాక్చాతుర్యంతో తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీ అని ముద్ర వేశారని ఆరోపించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కునారిల్లుతోందని విమర్శించారు. ఆ పార్టీకి నడిపించే నాయకుడే కరవయ్యాడని అన్నారు. చంద్రబాబే బీజేపీలోకి వలసల్ని ప్రోత్సహిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణకు అన్ని విధాలా న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీయేనని రేవూరి స్పష్టం చేశారు.

More Telugu News