Punjab: పంజాబ్ లోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది మృతి

  • ఓ పెళ్లి వేడుక కోసం బాణసంచా తయారుచేస్తుండగా ఘటన
  • 30 మందికి తీవ్ర గాయాలు
  • ఫ్యాక్టరీలో మరో 50 మంది

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా బటాలా పట్టణంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఈ రోజు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 50 మంది ఫ్యాక్టరీలో చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు.

ఓ పెళ్లి వేడుక కోసం బాణసంచా తయారుచేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ దుర్ఘటనపై గుర్‌దాస్‌పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ట్వీట్ చేశారు. బటాలా ఫ్యాక్టరీలో జరిగిన ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

More Telugu News