Andhra Pradesh: టీడీపీకి పూర్వవైభవమే లక్ష్యంగా.. రేపటి నుంచి చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన!

  • తూర్పు గోదావరి నుంచి పర్యటన షురూ
  • వివరాలు ప్రకటించిన ఎమ్మెల్యే చినరాజప్ప
  • కాకినాడలో టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి భేటీ

సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలుగుదేశం కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలనీ, పార్టీ కేడర్ లో ధైర్యం నింపాలని నిర్ణయించారు. ఈ నెల 5న చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.

రేపు ఉదయం 11 గంటలకు చంద్రబాబు అచ్చంపేటలోని కల్యాణ మండపంలో టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారనీ, నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమావేశమవుతారని పేర్కొన్నారు. అనంతరం కాకినాడలో పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఇలా 13 జిల్లాల్లోనూ చంద్రబాబు పర్యటన కొనసాగుతుందని చినరాజప్ప అన్నారు.

More Telugu News