Prabhas: 400 కోట్ల వసూళ్ల దిశగా 'సాహో'

  • క్రితం నెల 30న వచ్చిన 'సాహో'
  • నాలుగు భాషల్లో భారీ ఓపెనింగ్స్ 
  • 500 కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్ 

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ తెరకెక్కించిన 'సాహో' క్రితం నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా కథనాల సంగతి అటుంచితే, సాంకేతిక పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ప్రీమియర్స్ తో కలుపుకుని 130 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, రెండవ రోజునే 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లోను కలుపుకుని 5 రోజుల్లో 350 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 400 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. తెలుగులో ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, 'సాహో' దూకుడు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 500 కోట్ల మార్క్ ను టచ్ చేయడం 'సాహో'కి పెద్ద కష్టం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రభాస్ స్టామినాను చాటి చెప్పిన చిత్రంగా నిలిచింది.

More Telugu News