Chandrayaan-2: ల్యాండర్ కక్ష్యను మరోమారు తగ్గించిన ఇస్రో.. జాబిల్లికి మరింత చేరువ

  • ఈ తెల్లవారుజామున ప్రొపెల్షన్ సిస్టంను 9 సెకన్లు మండించిన ఇస్రో
  • చంద్రుడి దక్షిణ ధ్రువానికి మరింత చేరువైన ‘విక్రమ్’
  • 6న అర్ధరాత్రి దాటాక చంద్రుడిపై కాలుమోపనున్న ల్యాండర్

చంద్రయాన్-2లోని ల్యాండర్ ‘విక్రమ్’ కక్ష్యను ఈ తెల్లవారుజామున 3:42 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు. ల్యాండర్‌లోని ప్రొపల్షన్ సిస్టంను 9 సెకన్లపాటు మండించడం ద్వారా దాని కక్ష్యను రెండోసారి విజయవంతంగా తగ్గించారు. ఫలితంగా చంద్రుడి దక్షిణ ధ్రువానికి ల్యాండర్ మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్ 35 కిలోమీటర్లు X 101 కిలోమీటర్ల కక్ష్యలో ఉంది. ఆర్బిటర్ 96 కిలోమీటర్లుX125 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతోంది. ప్రస్తుతం వీటి పనితీరు బాగానే ఉందని ఇస్రో పేర్కొంది. ఈ నెల 6న అర్ధరాత్రి దాటాక 1:30 -2:30 గంటల మధ్య ల్యాండర్ దక్షిణ ధ్రువానికి చేరువలో ల్యాండ్ అవుతుంది. నాలుగు గంటల తర్వాత అందులోని రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు ప్రారంభిస్తుంది.

More Telugu News