Shamshabad Airport: రేపు ఎయిర్ పోర్టును పేల్చేస్తున్నాం... శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

  • బుధవారం ఎయిర్ పోర్టును బ్లాస్ట్ చేస్తున్నామంటూ బెదిరింపు
  • క్షుణ్ణంగా తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది
  • బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వైనం

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాయిరామ్ కాలేరు అనే మెయిల్ ఐడీతో బెదిరింపు సందేశం అందింది. బుధవారం నాడు శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చేస్తున్నామన్నది ఆ బెదిరింపు ఈమెయిల్ సారాంశం. ఏ సమయంలో చూసినా వేలమంది ప్రయాణికులు, సిబ్బందితో నిత్యం రద్దీగా ఉండే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగి అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే బాంబు లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈమెయిల్ ఐడీ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News