Shalini Pandey: భారీ ప్రాజెక్టులతో షాలినీ పాండే దశ తిరిగినట్టే

  • 'అర్జున్ రెడ్డి'తో షాలినీ పాండేకి క్రేజ్ 
  • ఆశించిన స్థాయిలో దక్కని అవకాశాలు 
  • రణ్ వీర్ సింగ్ జోడీగా హిందీ మూవీ  

సంచలన విజయం ఎలా ఉంటుందనే విషయాన్ని మరోమారు చాటిచెప్పిన చిత్రంగా 'అర్జున్ రెడ్డి' కనిపిస్తుంది. హీరో విజయ్ దేవరకొండతో పాటు, హీరోయిన్ షాలినీ పాండేకి కూడా ఈ సినిమా మంచి క్రేజ్ తీసుకొచ్చింది. గ్లామర్ పరంగా .. నటన పరంగా షాలినీ పాండే కుర్ర మనసులను కొల్లగొట్టేసింది. దాంతో ఈ అమ్మాయి తెలుగులో ఫుల్ బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఈ అమ్మాయి చెప్పుకోదగిన సినిమా ఏదీ చేయలేకపోవడంతో వెనుకబడిపోయింది.

దాంతో ఇక ఈ అమ్మాయి పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. కానీ లక్కీగా ఈ అమ్మాయి యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో 3 భారీ సినిమాల్లో చేయడానికి డీల్ కుదుర్చుకుందనేది తాజా సమాచారం. ఆ మూడింటిలో ఒక సినిమాలో ఆమె రణ్ వీర్ సింగ్ జోడీగా కనిపించనుందట. ఈ మూడు సినిమాలతో షాలినీ పాండే దశ తిరిగిపోవడం ఖాయమనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.

More Telugu News