Andhra Pradesh: కృష్ణా జిల్లాలో విష సర్పాల హల్ చల్.. పాము కాటుకు మహిళ మృతి!

  • అవనిగడ్డ ప్రాంతంలోని పెదపాలెంలో ఘటన
  • పొలానికి వెళ్లి వస్తున్న మహిళకు పాముకాటు
  • ఈ ఏడాదిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో విష సర్పాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా జిల్లాలోని నాగాయలంక మండలం పెదపాలెంలో ఓ మహిళను పాము కాటేసింది. పొలం నుంచి ఇంటికి వస్తున్న బొడ్డు నాగేశ్వరమ్మ(40)ను పాము కాటేయడంతో ఆమెను గ్రామస్తులు, బంధువులు హుటాహుటిన మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే నాగేశ్వరమ్మ ప్రాణాలు కోల్పోయింది. దీంతో జిల్లాలోని ఈ ఏడాదిలో పాము కాటుతో చనిపోయినవారి సంఖ్య 10కి చేరుకుంది.

More Telugu News