Andhra Pradesh: చంద్రబాబు, ఇమ్రాన్ ఖాన్ ల హెచ్చరికలు ఒకేలా ఉన్నాయి!: విజయసాయిరెడ్డి వెటకారం

  • జగన్ 3 నెలల్లోనే విఫలమయ్యారట
  • వెంటనే కుర్చీ నుంచి దిగిపోవాలట
  • చంద్రబాబు ఈ మేరకు గగ్గోలు పెడుతున్నారు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబును మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చికొడితే ఎక్కడో పడిన చంద్రబాబు హెచ్చరికలు ఒకేలా ఉన్నాయని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

కేవలం 3 నెలల్లోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని చంద్రబాబు చెబుతున్నారని దుయ్యబట్టారు. అర్జంటుగా కుర్చీని ఖాళీ చేయాలని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్వీట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి.. సీఎం జగన్, చంద్రబాబులను ట్యాగ్ చేశారు.

More Telugu News