Omar Abdullah: గడ్డం గీసుకోబోనని భీష్మించుకున్న ఒమర్ అబ్దుల్లా!

  • గృహ నిర్బంధంలో ఉన్న ఒమర్ అబ్దుల్లా
  • తనను విడిచిపెట్టేంత వరకు షేవ్ చేసుకోబోనంటూ భీష్మించుకున్న వైనం
  • లాన్ లో ప్రతి రోజు 8 కి.మీ. రన్నింగ్

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అక్కడున్న రాజకీయ నేతలు, వేర్పాటువాదులతో పాటు పలువురిని నిర్బంధించిన సంగతి తెలిసిందే. వీరిలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఉన్నారు. వీరిద్దరూ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఒమర్ అబ్దుల్లా గెడ్డం గీసుకోవడం మానేశారు. హౌస్ అరెస్ట్ అయిన తొలి రోజు నుంచి గెడ్డం గీసుకోబోనని ఆయన భీష్మించుకున్నారు. తనను విడిచిపెట్టేంత వరకు షేవ్ చేసుకోబోనని ఆయన స్పష్టం చేశారు.

 ఒమర్ అబ్దుల్లాను నిన్న ఆయన సోదరి సాఫియా అబ్దుల్లా, ఆమె ఇద్దరు పిల్లలు, మేనత్త కలిశారు. అనంతరం సాఫియా మాట్లాడుతూ, షేవ్ ఎందుకు చేసుకోలేదని తాము అడిగామని... హౌస్ అరెస్ట్ నుంచి తాను స్వేచ్ఛ పొందేంత వరకు షేవ్ చేసుకోబోనని ఆయన తెలిపారని చెప్పారు. ఒమర్ మేనల్లుడు జైద్ మాట్లాడుతూ, గృహ నిర్బంధం ఎలా ఉందని తాను అడిగానని... లాన్ లో ప్రతిరోజు 8 కి.మీ. రన్నింగ్ చేస్తున్నానని చెప్పారని తెలిపారు.

More Telugu News