Rishabh Pant: ధోనీ 15 టెస్టుల్లో సాధించిన ఘనత పంత్ 11 టెస్టుల్లోనే సాధించాడు!

  • టెస్టుల్లో వేగంగా 50 మందిని అవుట్ చేసిన భారత వికెట్ కీపర్ గా పంత్ రికార్డు
  • ఇప్పటివరకు ధోనీ పేరిట ఉన్న రికార్డు
  • విండీస్ తో రెండో టెస్టు సందర్భంగా ఘనత నమోదు చేసిన పంత్

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ధోనీ వారసుడిగా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకుంటున్న ఈ ఢిల్లీ యువ కిశోరం టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 50 మందిని అవుట్ చేసిన భారత వికెట్ కీపర్ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ధోనీ పేరిట ఉంది. అయితే 50 మందిని అవుట్ చేసేందుకు ధోనీకి 15 టెస్టులు పట్టగా, పంత్ కేవలం 11 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. విండీస్ తో రెండో టెస్టు సందర్భంగా పంత్ ఈ రికార్డు నమోదు చేశాడు. విండీస్ బ్యాట్స్ మన్ క్రెగ్ బ్రాత్ వైట్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో పంత్ ఖాతాలో 50వ వికెట్ చేరింది.

More Telugu News