Andhra Pradesh: ఏపీ ఐటీ పాలసీని రూపొందించే బాధ్యతను రెండుసార్లు వైఎస్ నాకు ఇచ్చారు!: ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ

  • నేడు వైఎస్ 10వ వర్థంతి
  • నివాళులు అర్పించిన అధికారిణి
  • వైఎస్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంస

ఏపీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రముఖ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ..  ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి రెండు సార్లు ఐటీ విధానాన్ని రూపొందించేందుకు వైఎస్ తనకు అవకాశమిచ్చారని తెలిపారు. అలాగే సైబరాబాద్, టైర్2 నగరాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల యువతకు ఉద్యోగాలు, మహిళలకు స్టాంప్ డ్యూటీపై 1 శాతం డిస్కౌంట్, ప్రతీ నెల ఒకటో తేదీనే పెన్షన్ల అందజేత వంటి చర్యలు తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఈరోజు వైఎస్ 10వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

More Telugu News