Jagan: రేపు ఇడుపులపాయలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలకు హాజరవుతున్న ఏపీ సీఎం జగన్

  • రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి
  • ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్న కుటుంబసభ్యులు
  • సాయంత్రం 4 గంటలకు విజయవాడలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ

ఏపీ సీఎం జగన్ రేపు కడప జిల్లా ఇడుపులపాయలో జరిగే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్ కు నివాళులు అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి జగన్ విజయవాడ పయనమవుతారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

More Telugu News