Tamil Nadu: జన్మదిన వేడుక.. కత్తులతో కేక్ కోసిన ఇద్దరు రౌడీల అరెస్ట్

  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • పరారీలో ఉన్న మరో 9 మంది కోసం గాలింపు

బర్త్‌డే వేడుకల్లో కత్తులతో కేక్ కోసిన ఇద్దరు రౌడీలను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిందీ ఘటన. రెండు రోజుల క్రితం పుట్టిన రోజు సందర్భంగా రౌడీలు కత్తులతో కేక్ కోసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. పోలీసుల విచారణలో వీరు కోయంబత్తూరు సమీపంలోని శివనంతపురానికి చెందిన సతీశ్ కుమార్, సుందర్‌లనే రౌడీలని తేలింది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు, బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మరో 9 మంది కోసం గాలిస్తున్నారు.

More Telugu News