Sindhu: ఉప రాష్ట్రపతికి పీవీ సింధు కానుక

  • హైదరాబాదులో ఉపరాష్ట్రపతిని కలసిన సింధు 
  • బ్యాడ్మింటన్ రాకెట్ బహూకరణ 
  • సింధు దేశానికి గర్వకారణమన్న వెంకయ్యనాయుడు  

ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధుపై అభినందనల వర్షం వెల్లువెత్తుతోంది. తాజాగా ఆమెను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. సింధు దేశానికి గర్వకారణం అని కొనియాడారు. ఆమె లాంటి అథ్లెట్లు యువతకు స్ఫూర్తిప్రదాతలని వెంకయ్య పేర్కొన్నారు. సింధు ఈ ఉదయం హైదరాబాద్ లో తన తల్లిదండ్రులతో కలసి వెళ్లి వెంకయ్యనాయుడిని కలిసింది. తాను గెలిచిన స్వర్ణ పతకాన్ని ఆయనకు చూపించడమే కాదు, ఓ బ్యాడ్మింటన్ రాకెట్ ను ఆయనకు బహూకరించింది.

More Telugu News