Andhra Pradesh: హైదరాబాదులోని కన్నా నివాసంలో ఏపీ బీజేపీ నేతల సమావేశం

  • గచ్చిబౌలిలోని కన్నా నివాసంలో భేటీ
  • పార్టీ బలోపేతంపై చర్చలు
  • హాజరుకానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, సోము వీర్రాజు, పురంధేశ్వరి, మాణిక్యాలరావు, సత్యమూర్తి హాజరయ్యారు. ఏపీలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వీరు చర్చలు జరుపుతున్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.  

More Telugu News