Jammu And Kashmir: భారత సైన్యంలో చేరిన 575 మంది జమ్మూకశ్మీర్ యువత!

  • జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీలో చేరిక
  • భారత సైన్యంలో భాగస్వాములు కావడం గర్వంగా ఉందన్న యువ సైనికులు
  • దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమంటూ వ్యాఖ్య

జమ్మూకశ్మీర్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన 575 మంది యువకులు ఈరోజు ఇండియన్ ఆర్మీలో చేరారు. జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీలోకి వీరిని తీసుకున్నారు. శ్రీనగర్ లో ఈరోజు జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ లో వీరు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కొత్తగా రిక్రూట్ అయిన యువకులు మాట్లాడుతూ, మాతృదేశానికి సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, విధుల్లో భాగంగా ప్రాణాలను అర్పించేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. భారత సైన్యంలో భాగస్వాములు కావడం తమకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీని 1947లో ఏర్పాటు చేశారు. పొరుగుదేశం నుంచి చొరబడేవారిని నిలువరించే క్రమంలో ఈ విభాగాన్ని ఏర్పరచారు.

More Telugu News