Maharashtra: మహారాష్ట్రలోని రసాయన పరిశ్రమలో పేలుడు.. 8 మంది మృతి

  • ఇరవై మందికి పైగా గాయాలు
  • గ్యాస్‌ సిలెండర్ల పేలుడు వల్లే ఘటన
  • ప్రమాద సమయానికి కర్మాగారంలో వంద మంది కార్మికులు

దాదాపు వంద మంది కార్మికులు పనిచేస్తున్న ఓ రసాయన కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇరవై మందికి పైగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో ఉన్న ఈ పరిశ్రమలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కర్మాగారంలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన గ్యాస్‌ సిలెండర్లు పేలడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఇతర అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

More Telugu News