YSRCP: వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను ఇంకా పట్టుకోలేకపోయారు: వర్ల రామయ్య విమర్శలు

  • వివేకా హత్య కేసు గందరగోళంగా మారింది
  • ఈ హత్య జరిగి 5 నెలలు అయింది
  • హంతకులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది

వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను ఇంత వరకూ పట్టుకోలేకపోయారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. వివేకా హత్య కేసు గందరగోళంగా మారిందని, ఈ హత్య జరిగి 5 నెలలు అయినా అసలు హంతకులెవరో తేలలేదని అన్నారు. వివేకాను హత మార్చిన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ కేసుకు సంబంధించిన నార్కో అనాలసిస్ రిపోర్ట్ ను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ హత్య కేసు విషయమై సీఎం జగన్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

More Telugu News