Vijayasai Reddy: పరమానందయ్య శిష్యుడిలా సొల్లు చెప్పకు విజయసాయిరెడ్డీ: బుద్ధా వెంకన్న

  • కుల, మతాలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు
  • టీటీడీలో అన్యమతస్థులను జొప్పించిందే మీ మహామేత
  • కావాలంటే వెళ్లి జీవోలు చూసుకోండి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి ఫైర్ అయ్యారు. కుల, మతాలను అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం 420 తాతయ్య విజయసాయిరెడ్డికే చెల్లిందని ఆయన విమర్శించారు. అసలు టీటీడీలో అన్యమతస్థులను జొప్పించిందే మీ మహామేత అని ఎద్దేవా చేశారు. కావాలంటే వెళ్లి జీవోలు చూసుకోవాలని... ఇప్పుడొచ్చి పరమానందయ్య శిష్యుడిలా సొల్లు చెప్పొద్దని అన్నారు.  

More Telugu News