Telugudesam: కోడెల, ఆయన కుమారుడు శివరామ్ కు ముందస్తు బెయిల్ మంజూరు

  • కోడెల, శివరామ్ లపై పలు ఆరోపణలు
  • ఏపీ హైకోర్టును ఆశ్రయించిన తండ్రీకొడుకులు
  • 5 కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు

ఏపీ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావు, ఆయన కుమారుడు శివరామ్ పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం, వీరిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. వీరిపై నమోదైన ఐదు కేసులకు సంబంధించి ఈ బెయిల్ మంజూరు చేసినట్టు సమాచారం. కాగా, కోడెల కుటుంబసభ్యులపై సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి.

More Telugu News