Gopichand maqlineni: నాగార్జునతో ఆ దర్శకుడి సినిమా లేదట

  • నేను నాగ్ సార్ ను కలవలేదు 
  • ఆయనకి కథ చెప్పాననడంలో నిజం లేదు  
  • ఓ సీనియర్ హీరోతో తన సినిమా ఉందన్న గోపీచంద్ మలినేని  

నాగార్జున కథానాయకుడిగా ఇటీవల థియేటర్లకు వచ్చిన 'మన్మథుడు 2' పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమా నిర్మాతగానూ నాగార్జునకి నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత ఆయన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున కూడా ధృవీకరించారు.

అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాగార్జున తదుపరి సినిమా వుండనున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ వార్త జోరందుకోవడంతో, ఈ విషయంపై గోపీచంద్ మలినేని స్పందించాడు. "నేను నాగార్జున గారిని కలవలేదు .. ఆయనకి ఎలాంటి కథను వినిపించలేదు. ఏ కథకి సంబంధించిన చర్చలు మా మధ్య జరగలేదు. నాగార్జున గారితో నేను సినిమా చేయనున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. త్వరలో ఓ సీనియర్ హీరోతో నా సినిమా ఉంటుంది. ఆ విషయాలను త్వరలోనే వెల్లడిస్తాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News