Adi saikumar: 'జోడి' సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్

  • మరో ప్రేమకథా చిత్రంగా 'జోడి'
  • బెట్టింగ్ పిచ్చోడిగా సీనియర్ నరేశ్ 
  • వచ్చేనెల 6వ తేదీన విడుదల

ఆది సాయికుమార్ - శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్లో 'జోడి' సినిమా రూపొందింది. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

ఆది సాయికుమార్ తండ్రి పాత్రలో, బెట్టింగ్ పిచ్చోడిగా సీనియర్ నరేశ్ కనిపిస్తున్నారు. సింపుల్ గా ఉండటానికే ఇష్టపడే అమ్మాయిగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపిస్తోంది. హీరో .. హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు ఈ ట్రైలర్ లో చోటుచేసుకున్నాయి. గొల్లపూడి మారుతీరావు .. సితార .. వెన్నెల కిషోర్ వంటి నటీనటులు ఈ సినిమాకి ప్రధాన బలంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆది సాయికుమార్ వున్నాడు.

More Telugu News