Adi Pinishetty: 'జోడి' హిట్ కొట్టేయడం ఖాయమంటున్న ఆది పినిశెట్టి

  • ఆది పినిశెట్టికి థ్యాంక్స్ చెప్పాలి 
  • శ్రద్ధా శ్రీనాథ్ బాగా చేసింది 
  • వచ్చేనెల 6న విడుదల

ఆది పినిశెట్టి కథానాయకుడిగా .. శ్రద్ధా శ్రీనాథ్ నాయికగా దర్శకుడు విశ్వనాథ్ అరిగెల 'జోడి' సినిమాను రూపొందించాడు. విజయలక్ష్మి నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, "ముందుగా ఈ కథ విజయ్ దేవరకొండకి వినిపించాను. కొన్ని కారణాల వలన ఆయనతో ఈ సినిమా చేయడం కుదరలేదు.

ఆ తరువాత ఈ కథకి ఆది పినిశెట్టి అయితే కరెక్ట్ అనిపించింది. ఈ సినిమా చేయడానికి ఆయన అంగీకరించడంతో సెట్స్ పైకి వచ్చింది. శ్రద్ధా శ్రీనాథ్ అంగీకరించడం వలన ఈ కథకు మరింత బలం చేకూరినట్టుగా భావించాను. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ప్రతి సన్నివేశం సహజంగా అనిపించడం కోసం చాలా కష్టపడ్డాను. సంగీతం .. మాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అన్నివర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుందనీ .. సక్సెస్ ను సాధిస్తుందని నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News