Raviteja: 'డిస్కో రాజా' నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో 'డిస్కోరాజా'
  • సంగీత దర్శకుడిగా తమన్
  • ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న రవితేజ

రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతోంది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది.

'వినాయక చవితి' పండుగ సందర్భంగా, వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టుగా సమాచారం. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచే పనిలో దర్శకుడు వీఐ ఆనంద్ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. కొంతకాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన ఆశిస్తోన్న హిట్ ఈ సినిమాతో లభిస్తుందో లేదో చూడాలి.

More Telugu News