Nani: 'గ్యాంగ్ లీడర్'పై అంచనాలు పెంచుతోన్న ట్రైలర్

  • వినోదభరిత చిత్రంగా 'గ్యాంగ్ లీడర్'
  • నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పరిచయం 
  • వచ్చేనెల 13వ తేదీన సినిమా విడుదల

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్' రూపొందింది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా ద్వారా, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా పరిచయమవుతోంది. కార్తికేయ ప్రతినాయక పాత్రను చేసిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

రివెంజ్ కి సంబంధించిన కథలను రాసేవాడిగా ఈ ట్రైలర్లో నాని కనిపిస్తున్నాడు. యాక్షన్ .. కామెడీ .. సస్పెన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా వుంది. 'ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక పవర్ఫుల్ వెపన్ అమ్మాయి' అంటూ నాని చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా వుంది. వెన్నెల కిషోర్ .. ప్రియదర్శి .. శరణ్య ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, వచ్చేనెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News