Modi: వాజ్ పేయి, పారికర్, సుష్మా, జైట్లీ మరణించారు.. నెక్స్ట్ మోదీనే: బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  • బీజేపీపై ప్రతిపక్షం చేతబడులు చేయిస్తోంది
  • తర్వాతి వంతు మోదీదే
  • ట్విట్టర్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నజీర్ అహ్మద్

ప్రధాని మోదీని ఉద్దేశించి బ్రిటన్ ఎంపీ నజీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై భారత్ లోని ప్రతిపక్ష పార్టీ చేతబడులు చేయిస్తోందని ఆయన అన్నారు. ఈ కారణం వల్లే ఇప్పటికే బీజేపీ కీలక నేతలైన అటల్ బిహారీ వాజ్ పేయి, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు మరణించారని... తర్వాతి వంతు మోదీదేనని అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ వివాదాస్పదమైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యక్తులు చట్ట సభల్లోకి ఎలా వస్తారో అంటూ మండిపడ్డారు.

More Telugu News