Amit Shah: వాజ్‌పేయి నివాసం వున్న ఇంట్లోకి మారిన అమిత్ షా!

  • ఆగస్టు 15న గృహ ప్రవేశ వేడుకను నిర్వహించిన మంత్రి
  • మంగళవారం అధికారికంగా ఇంట్లోకి 
  • నివాసాలు ఖాళీ చేయని ఎంపీల భవనాలకు విద్యుత్, నీటి సరఫరా బంద్

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గతేడాది మరణించిన తర్వాత ఆయన నివసించిన ఢిల్లీలోని కృష్ణ మార్గ్‌లో ఉన్న భవనం ఖాళీగా ఉంటోంది. ఇటీవల ఆ భవనాన్ని కేంద్రమంత్రి అమిత్ షాకు కేటాయించారు. ఈ నెల 15న గృహ ప్రవేశ వేడుకను నిర్వహించిన అమిత్ షా.. నేడు ఆ ఇంట్లోకి మారారు.  ఇప్పటి వరకు ఆయన అక్బర్ రోడ్డులోని బంగ్లాలో ఉండేవారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా.. ఎన్‌డీయే ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి నివసించిన భవనాన్ని ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయని ఎంపీల నివాసాల్లో విద్యుత్, నీటి సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. ఏడు రోజుల్లోనే వాటిని ఖాళీ చేయాలని ఆదేశించింది.

More Telugu News