Nagashourya: 'పార్థు' కోసం రెడీ అవుతోన్న నాగశౌర్య

  • విడుదలకి సిద్ధమవుతోన్న 'అశ్వద్ధామ'
  • విలువిద్య నేపథ్యంలో సాగే 'పార్థు'
  • త్వరలోనే పూర్తి వివరాల వెల్లడి

యువ కథానాయకులలో నాగశౌర్యకి మంచి క్రేజ్ వుంది. మంచి ఒడ్డూ పొడుగు వుండే ఈ హీరోకి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ వుంది. త్వరలోనే ఆయన 'అశ్వద్ధామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తోన్న నాగశౌర్య, త్వరలోనే 'పార్థు' సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

ఏషియన్ సునీల్ నిర్మించే ఈ సినిమాకి సంతోష్ దర్శకత్వం వహించనున్నాడు. 'విలు విద్య'కి సంబంధించిన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనున్నట్టుగా చెబుతున్నారు. 'సుబ్రహ్మణ్యపురం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ దర్శకుడు, 'పార్థు'కి సంబంధించిన పనులతో బిజీగా వున్నాడని అంటున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

More Telugu News