Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోలను ట్రక్కు ఢీకొట్టడంతో 16 మంది మృతి

  • పలువురికి తీవ్రగాయాలు
  • షాజహాన్‌పూర్‌ సమీపంలో ఘోరం
  • ట్రక్కు అదుపు తప్పడంతో ప్రమాదం

అదుపు తప్పిన ట్రక్కు అదే రోడ్డులో వెళ్తున్న రెండు టెంపోలను ఢీకొట్టిన ప్రమాదంలో పదహారు మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లో ఈరోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

 షాజహాన్‌పూర్‌ జిల్లా కేంద్రం నుంచి వెళ్లే ప్రధాన రహదారిపై తాను  నడుపుతున్న ట్రక్కుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో అదే రోడ్డులో ప్రయాణికులతో వెళ్తున్న రెండు టెంపోలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టెంపోలు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులోని వారిలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా స్థానికులు హుటాహుటిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News