KS Ramarao: టీవీ9, ఎన్టీవీలపై విరుచుకుపడ్డ నిర్మాత కేఎస్ రామారావు!

  • 'కౌసల్యా కృష్ణమూర్తి' సినిమా తీసిన రామారావు
  • డబ్బులు ఇవ్వలేదని మీడియా చిన్నచూపు
  • సక్సెస్ మీట్ లో రామారావు కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు తెలుగు న్యూస్ చానెళ్లు టీవీ9, ఎన్టీవీలపై విరుచుకుపడ్డారు. తాను నిర్మాతగా తీసిన 'కౌసల్యా కృష్ణమూర్తి' సినిమాకు ఈ చానెళ్లు ప్రాధాన్యత ఇవ్వలేదని, చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రోత్సాహం తగ్గిపోయిందని అన్నారు. తన కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయగా, ఈ చానెళ్లు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని, తాను డబ్బులు ఇవ్వలేదన్నదే దీని వెనుక కారణమని ఆరోపించారు. చిన్న సినిమాలపై మీడియా చిన్నచూపు పెరిగిందని, మహేశ్ బాబు, చిరంజీవి సినిమాలంటేనే సినిమాలను కుంటున్నారని ఆయన మండిపడ్డారు. తాజాగా సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News