Keerthi Suresh: కీర్తి సురేశ్ సినిమాకి టైటిల్ ఖరారు

  • 'మహానటి'తో పెరిగిన క్రేజ్ 
  • దర్శకుడిగా నరేంద్రనాథ్ 
  • సంగీత దర్శకుడిగా తమన్

కీర్తి సురేశ్ తెలుగులో 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఆమె తదుపరి సినిమా కోసం అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తన తదుపరి సినిమాగా నాయికా ప్రాధాన్యత కలిగిన కథనే ఆమె ఎంచుకుంది. నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు. 'మిస్ ఇండియా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ, టైటిల్ రివీల్ టీజర్ ను వదిలారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ కీర్తి సురేశ్ స్థాయిని మరింతగా పెంచేదిలా ఉంటుందని అంటున్నారు.

More Telugu News