Sruthi Hariharan: 'మీటూ' కేసులో సినీనటి శ్రుతి హరిహరణ్ కు షాక్

  • అర్జున్ తనను అసభ్యంగా తాకారంటూ శ్రుతి ఆరోపణలు
  • శ్రుతిపై పరువు నష్టం దావా వేసిన అర్జున్ పిల్లలు
  • శ్రుతి పిటిషన్ ను కొట్టేసిన కోర్టు

ప్రముఖ సినీ నటుడు అర్జున్ పై 'మీటూ' ఉద్యమం నడుస్తున్న సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించిన హీరోయిన్ శ్రుతి హరిహరణ్ పతాక శీర్షికల్లో ఎక్కిన సంగతి తెలిసిందే. షూటింగ్ సందర్భంగా ఓ సన్నివేశాన్ని ఎలా చేయాలో వివరిస్తూ, తనను అసభ్యంగా తాకారని ఆమె ఆరోపించింది. అప్పట్లో ఆమె పోలీసులకు కూడా అర్జున్ పై ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో చిత్ర పరిశ్రమ చేసిన ప్రయత్నాలకు కూడా ఆమె తలొగ్గలేదు. అనంతరం ఆమెపై అర్జున్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి.

మరోవైపు, తన తండ్రి పరువుకు శ్రుతి భంగం కలిగించిందంటూ అర్జున్ పిల్లలు ఆమెపై రూ. 5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అయితే, అర్జున్ పిల్లలు తనపై వేసిన కేసు చెల్లదంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు ఆమెకు షాక్ ఇచ్చింది. పిటిషన్ చెల్లదంటూ కొట్టివేసింది.

More Telugu News