Nikhil: 'కార్తికేయ 2'కి హీరోయిన్ దొరికేసింది

  • గతంలో వచ్చిన 'కార్తికేయ' హిట్ 
  • సీక్వెల్ కి జరుగుతోన్న సన్నాహాలు 
  • తెలుగులో శ్రుతి శర్మకి రెండో సినిమా

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ కథానాయకుడిగా కొంతకాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కార్తికేయ', భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి చందూ - నిఖిల్ రంగంలోకి దిగారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులతో ఇద్దరూ బిజీగా వున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించారు.

తాజాగా శ్రుతి శర్మను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమా ద్వారా తెలుగు తెరకి శ్రుతి శర్మ పరిచయమైంది. ఆ సినిమా సక్సెస్ తరువాత ఆమెకి లభించిన అవకాశం ఇదే. ఈ సినిమాలో ఆమె జర్నలిస్ట్ గా హీరోయిన్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆకర్షణీయమైన కళ్లతో తొలి సినిమాతోనే యూత్ హృదయాలను దోచేసిన ఈ అమ్మాయి, మొత్తానికి మంచి ఛాన్సే కొట్టేసింది.

More Telugu News