Tirumala: తిరుమలలో అన్యమత ప్రచారం... తొలి వేటు పడింది!

  • భక్తులకు ఇచ్చిన టికెట్ల వెనుక అన్యమత ప్రచారం
  • నెల్లూరు జోన్ స్టోర్స్ కంట్రోలర్ నిర్లక్ష్యం
  • జగదీశ్ బాబుపై సస్పెన్షన్ వేటు

తిరుమలలో భక్తులకు ఇచ్చిన బస్సు టికెట్ల వెనుక అన్యమత ప్రచార ప్రకటన ఉండటాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన వైఎస్ జగన్ సర్కారు, ఓ అధికారిపై వేటు వేసింది. నెల్లూరు జోన్‌ లో స్టోర్స్‌ కంట్రోలర్‌ గా విధులు నిర్వహిస్తున్న జగదీశ్ బాబుపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

టికెట్ల రోల్స్‌ ను పంపిణీ చేయడంలో జగదీశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలినందునే ఈ చర్యలు తీసుకున్నామని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు వెల్లడించారు. జగదీశ్ అనాలోచిత నిర్ణయం కారణంగా వేలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ ప్రతిష్టకు సైతం భంగం వాటిల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News