Mahesh Babu: 'ఎవరు' చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్న మహేశ్ బాబు

  • అడవి శేష్ తో పాటు చిత్రబృందాన్ని అభినందించిన సూపర్ స్టార్
  • కాన్సెప్ట్ బాగుందంటూ ప్రశంసలు
  • దర్శకత్వం భేష్ అంటూ ట్వీట్

ఇటీవలే రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'ఎవరు'. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాపై తన అభిప్రాయాలు వెల్లడించారు. "'ఎవరు' చిత్రాన్ని చూశాను. మునికాళ్లపై నిలుచోబెట్టేంత టెన్షన్ కలిగించే సినిమా ఇది. కాన్సెప్ట్ అదిరిపోయింది. దర్శకత్వం చాలా బాగుంది. సరైన పద్ధతిలో తీసిన సినిమా ఇది. కంగ్రాచ్యులేషన్స్ అడవి శేష్. ఈ విజయం పట్ల చిత్రబృందాన్ని మొత్తానికి నా అభినందనలు" అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News