MS Dhoni: ధోనీ కమాండో లుక్... వైరల్ అవుతున్న ఫొటోలు!

  • జైపూర్ ఎయిర్ పోర్టులో మీడియా కంటపడిన ధోనీ
  • తలకు నల్లటి వస్త్రం, ఆర్మీ గ్రీన్ టీషర్టుతో ధోనీ కొత్త లుక్
  • అభిమానులతో ఫొటోలకు పోజులిచ్చిన ధోనీ

టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవలే కశ్మీర్ లోయలో సైనిక విధులు పూర్తి చేసుకుని స్వస్థలానికి తిరిగి వచ్చాడు. తాజాగా, జైపూర్ లో ఓ ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో మీడియా కెమెరాలకు చిక్కాడు. కొత్త లుక్ లో ఉన్న ధోనీని చూడగానే ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. కమాండో లుక్ తో ధోనీ కొత్తగా కనిపిస్తుండడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

తల పైభాగాన్ని నల్లటి వస్త్రంతో కవర్ చేసుకున్న ధోనీ, ఆర్మీ గ్రీన్ టీషర్ట్ ధరించి ఎయిర్ పోర్టులో కనిపించగానే ఫ్యాన్స్ హడావుడి అంతాఇంతా కాదు. అభిమానుల కోసం కాస్త సమయం కేటాయించిన ధోనీ వారితో ఫొటోలకు పోజులిచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన సెక్యూరిటీ గార్డులు ధోనీ ముందుకెళ్లేందుకు సహకరించారు.

More Telugu News