LK Advani: ఏ రెస్టారెంట్ బాగుంటుందో చెప్పాలంటే అరుణ్ జైట్లీని మించిన వారు లేరు: అద్వానీ

  • జైట్లీ నాకెంతో మంచి మిత్రుడు
  • పార్టీ కష్టాల్లో ఉన్నవేళ ఆదుకున్న వ్యక్తి
  • వేగమైన విశ్లేషణ జైట్లీ సొంతమన్న అద్వానీ

భారతీయ జనతా పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతి సమయంలోనూ, తనదైన చతురతతో సమస్యలను పరిష్కరించే అరుణ్ జైట్లీ తనకు ఎంతో మంచి మిత్రుడిగా మారాడని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ వ్యాఖ్యానించారు. జైట్లీ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఆయన, జైట్లీతో తన అనుబంధాన్నితలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తాను బయటకు వెళ్లి తినాలని భావించినప్పుడల్లా, ఏ రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంటుందన్న విషయాన్ని జైట్లీనే చెప్పేవారని అన్నారు.

జైట్లీ మరణం తనకు వ్యక్తిగతంగా ఎంతో లోటని, ఆయన మృతితో దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. జైట్లీ ఓ గొప్ప పార్లమెంటేరియన్ అని, మంచి నేతని కొనియాడారు. ఏ విషయాన్ని అయినా, వేగంగా విశ్లేషించడంలో జైట్లీని మించిన వారు లేరని, ఆయన తన మృదు స్వభావంతో ఎవరికైనా దగ్గరవుతారని అన్నారు.

More Telugu News