Ghaziabad: తన భార్యపై చీప్ కామెంట్లు చేస్తున్నాడని.. స్నేహితుడిని చంపేశాడు!

  • బాధితుడు, నిందితుడు ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసలే
  • బాధితుడిపై హత్య, దోపిడీ కేసులు
  • నిందితుడిపై 13 క్రిమినల్ కేసులు

తన భార్యపై అసభ్య కామెంట్లు చేసిన స్నేహితుడిని దారుణంగా కాల్చి చంపాడో వ్యక్తి. ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  సన్నీ, జైల్ జింగ్(35), మహేందర్ (35) స్నేహితులు. సన్నీ, జైల్‌సింగ్‌లు ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసలే. ఈ నెల 2న రాత్రి ముగ్గురూ కలిసి డ్రగ్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జైల్ సింగ్ భార్యపై సన్నీ అసభ్య కామెంట్లు చేశాడు. ఇది తట్టుకోలేని జైల్ సింగ్ స్నేహితుడితో గొడవపడ్డాడు. ఘర్షణ మరింత ముదరడంతో సన్నీపై మిగతా ఇద్దరూ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సన్నీ అక్కడికక్కడే మృతి చెందాడు.

అనంతరం సన్నీ మృతదేహాన్ని ఓ కవర్‌లో చుట్టేసి ఘజియాబాద్ సబ్జీ మండీ ప్రాంతంలో పడేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జైల్ సింగ్, మహేందర్‌లను అరెస్ట్ చేశారు. హత్య, దోపిడీకి సంబంధించిన ఐదు కేసుల్లో సన్నీ నిందితుడని పోలీసులు తెలిపారు. అలాగే, జైల్ సింగ్‌పై 13 క్రిమినల్ కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News