India: వెస్టిండీస్ 222 ఆలౌట్... టీమిండియాకు 75 పరుగుల ఆధిక్యం

  • నార్త్ సౌండ్ లో తొలి టెస్టు
  • మొదటి ఇన్నింగ్స్ లో 297 పరుగులు చేసిన భారత్
  • తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడిపోయిన విండీస్
  • ఇషాంత్ శర్మకు 5 వికెట్లు

ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ కు 75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 297 పరుగులు చేయగా, విండీస్ 222 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్ ఇషాంత్ శర్మ 5 వికెట్లతో విండీస్ వెన్ను విరిచాడు. ఇషాంత్ క్రాస్ సీమ్ బౌలింగ్ కు కరీబియన్ బ్యాట్స్ మన్ల వద్ద సమాధానం లేకుండా పోయింది.

ఇషాంత్ కు తోడు షమీ, జడేజా కూడా చెరో 2 వికెట్లతో రాణించడంతో విండీస్ తక్కువ స్కోరుకు పరిమితమైంది. ఆ జట్టులో రోస్టన్ చేజ్ 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హోల్డర్ 39, హెట్మెయర్ 35 పరుగులు సాధించారు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు.

More Telugu News